Site icon TeluguMirchi.com

రామ్‌చర‌ణ్ షాక్ అయ్యాడ‌ట‌!

Gouravamమెగా ఇంట్లోంచి మ‌రో హీరో వ‌చ్చేశాడు… అత‌నే అల్లు శిరీష్‌. గౌర‌వం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం తమిళంలోనూ విడుద‌ల కానుంది. యామీ గౌత‌మ్ క‌థానాయిక‌గా న‌టించింది. రాధామోహ‌న్ ద‌ర్శకుడు. ప్రకాష్‌రాజ్ నిర్మాత‌గా వ్యవ‌హ‌రించారు. గౌర‌వం ప్రచార చిత్రాల‌ను ఉగాది సంద‌ర్భంగా గురువారం ఉయ‌దం హైద‌రాబాద్‌లో రామ్‌చ‌ర‌ణ్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ మాట్లాడుతూ శిరీష్ నాకు చాలా క్లోజ్‌. చాలా తెలివైన నిర్ణయాలు తీసుకొంటాడు. గీతా ఆర్ట్స్‌ని మ‌రో లెవిల్‌కి తీసుకెళ్తాడ‌నుకొన్నా. కానీ… హీరో అయి… నాకు షాక్ ఇచ్చాడు. ప్రకాష్‌రాజ్ ఎంచుకొనే సినిమాలు చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి. వాటిలో గౌర‌వం కూడా ఒక‌టి కావాల‌ని కోరుకొంటున్నా…. అన్నారు. శిరీష్ మాట్లాడుతూ “హీరో కావాలంటే ఎంత శ్రమ ప‌డాలో…. చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌ను చూసి తెలుసుకొన్నా. న‌ట‌న‌లో యేడాదిన్నర ట్రైనింగ్ తీసుకొన్నా. నేర్చుకోగా… నేర్చుకోగా ఒకొక్కటీ అర్థమ‌వుతాయి. నాకు రాధామోహ‌న్ అంటే చాలా ఇష్టం. మీ సినిమాలో చిన్న పాత్ర ఇవ్వండి చేస్తా… అని ఆయ‌న్ని అడిగా. ఓసారి ఈ క‌థ చెప్పారు. ఇప్పుడు సినిమాగా మీ ముందుకు వ‌స్తోంది.. అన్నారు. ఈ కార్యక్రమంలో రాధా మోహ‌న్‌, యామిగౌత‌మ్‌, అల్లు అర‌వింద్‌, దిల్ రాజు, చిన్ని కృష్ణ, బండ్ల గ‌ణేష్‌, బీవీఎస్ ర‌వి పాల్గొన్నారు.

Exit mobile version