మణిరత్నం బేసిగ్గా తెలుగు దర్శకుడు కాదు. ఆయన చివరిగా తెలుగులో తీసింది గీతాంజలి మాత్రమే. అయితే ప్రేక్షకులు ఆయన్ని అలా చూడరు. ఆయన తీసిన తమిళ సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతాయి. కేవలం ఆయన బ్రాండ్ తో ఆడుతాయి. అయితే.. గత కొంతకాలంగా ఓ తెలుగు సినిమా కోసం ప్రయత్నిస్తున్నారాయన. మహేష్బాబుకి ఓ కథ చెప్పినా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు రామ్ చరణ్తో ఫిక్సయ్యారు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమా తర్వాత మణిరత్నం సినిమా మొదలుపెడతాడని టాక్. ఇప్పుడీ సినిమాపై మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవికి యోధ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని వినిపిస్తుంద. ఇటివలే చెర్రీని కలిసి ఫుల్ లెంగ్త్ నెరేషన్ ఇచ్చారట మణిరత్నం. స్టోరీ లైన్ నుంచి అన్ని యాంగిల్స్ నచ్చేసిన చెర్రీ.. ఈ చిత్రానికి యోధ అనే టైటిల్ ఫైనల్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నారని వినిపిస్తుంది.