ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుని ‘రంగస్థలం’చేయలేదని అంటున్నాడు రామ్చరణ్. సుకుమార్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సమంత కథానాయిక.శుక్రవారం ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్స్ మీట్ను ఏర్పాటు చేసింది.
రామ్చరణ్ మాట్లాడుతూ.. ‘‘ ఈ విజయం చూస్తుంటే ఆనందంగా ఉంది. ‘ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ఒప్పుకొన్నారా?’ అని అడుగుతుంటారు. ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేయలేదు. సుకుమార్గారు చెప్పింది నచ్చి ఒకే చేశా. నేను కమర్షియల్ హీరోను కాదు. మా సినిమాతో పది మందికి డబ్బులొస్తే మరింత ఆనంద పడతా. ఇలాంటి విజయాలు మరిన్ని రావాలి. ఈ వేసవిలో విడుదలయ్యే రెండు పెద్ద సినిమాలతో పాటు, మిగిలిన సినిమాలన్నీ విజయం సాధించాలి’’అని చెప్పుకొచ్చాడు చరణ్.