రామ్‌ చ‌ర‌ణ్ ఫైటింగులు

Ram-Charanరామ్‌ చ‌ర‌ణ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మొన్నటి వ‌ర‌కూ తుఫాన్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ‘ఎవ‌డు’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీపైడిప‌ల్లి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో పోరాట స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. వీటికి ఫైట్ మాస్టర్ పీట‌ర్ హెయిన్స్ నేతృత్వం వ‌హిస్తున్నారు. క‌థ‌లో కీల‌కంగా వ‌చ్చే పోరాట స‌న్నివేశం ఇది. ఇక్కడే క‌థ మ‌లుపు తిరుగుతుంది. అందుకే చిత్రబృందం ఈ ఫైట్‌ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటోంది. జులై లో ఈ సినిమా విడుద‌లయ్యే అవ‌కాశాలున్నాయి.