అందరివాడు సినిమా తరవాత మెగా హీరోలతో జట్టు కట్టలేదు శ్రీనువైట్ల. ఇప్పుడు రామ్చరణ్ని డైరెక్ట్ చేస్తాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. శ్రీనువైట్లతో సినిమా చేయడానికి చరణ్ కూడా సిద్దంగా ఉన్నాడని చెప్పుకొన్నారు. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ నిజమైంది. త్వరలోనే పట్టాలెక్కబోతోంది కూడా. ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తారు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. ప్రస్తుతం చరణ్.. గోవిందుడు అందరి వాడేలే సినిమాతో బిజీ గా ఉన్నాడు. శ్రీనువైట్ల ఆగడు సెట్లో గడుపుతున్నారు. ఈ రెండు సినిమాలూ ఆగస్టులోగా పూర్తవుతాయి. అందుకే ఆగస్టులో ముహూర్తం ఫిక్స్ చేశారన్నమాట. మరి బోయపాటి శ్రీను సినిమాఎప్పుడన్న సందిగ్థం నెలకొంది. ఒకవేళ శ్రీను కూడా.. చరణ్ కోసం కథ రెడీ చేస్తే ఒకేసారి ఇద్దరి శ్రీనులతో పనిచేస్తాడన్నమాట. ఒకరు శ్రీనువైట్ల, ఇంకొకరు బోయపాటి శ్రీను.