చరణ్ కు 15కోట్లు ఇచ్చారట ?

charanతుఫాన్ ఫ్లాఫ్ తర్వాత డీలా పడ్డ చరణ్ ‘ఎవడు’ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. అదే ఊపులో కృష్ణ వంశి తో సినిమాని మొదలెట్టేశాడు. ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. సంక్రాతి బ్లాక్ బాస్టర్ హీరో అనిపించుకున్న చరణ్ కు ఈ చిత్రం కోసం నిర్మాత అదిరిపోయే పారితోషికం ఇచ్చాడట. ఈ చిత్రం కోసం చరణ్ 15 కోట్లు ఇచ్చారని టాక్. అయితే ఇది చరణ్ డిమాండ్ కాదట. అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చినందుకు ఈ నిర్మాత అమాంతం చరణ్ పారితోషికాన్ని ఆ రేంజికి పెంచేసినట్టు వినిపిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ల రేమ్యునిరేషన్ రేంజ్ కు చేరిపోయాడు చరణ్.