Site icon TeluguMirchi.com

చరణ్ మళ్లీ గుర్రమెక్కుతున్నాడు

ramcharn
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘హార్స్ రైడింగ్’ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హార్స్ రైడింగ్ అంటే చరణ్ కు మహా ఇష్టం. చిన్నప్పుడే గుర్రపు స్వారీలో ప్రావీణ్యం సాధించాడు. ‘మగధీర’ లో ఆ నైపుణ్యాన్ని ప్రధర్శించాడు. చరణ్ హార్స్ రైడింగ్ కు ప్రేక్షకులు ఫిధా అయిపోయారు. మగధీర తర్వాత నాయక్ సినిమా శుభలేఖ పాటలో గుర్రంపై మెరిశాడు. ఇప్పుడు మరోసారి తన గుర్రం స్వారీ ప్రావీణ్యం చూపించబోతున్నాడు. అయితే ఈ సారి పాటలో కాదు. ఓ యాక్షన్ సీక్వెన్స్. రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం ‘గోవిందుడు అందరి వాడెలే’. కృష్ణ వంశి దర్శకుడు. ఇందులో చరణ్ హార్స్ రైడింగ్ తో అలరించబోతున్ననట్లు సమాచారం. కధకు అనుగునంగానే చరణ్ హార్స్ రైడింగ్ కు సంభదించిన ఓ యాక్షన్ సీక్వెన్స్ వస్తుందట. దర్శకుడు కృష్ణ వంశి ప్రత్యేక శ్రద్ధతీసుకొని ఈ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నానారామ్ గూడా జరుగుతోంది. చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. అక్టోబర్ 1 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Exit mobile version