రామ్ చరణ్ అంత సీరియస్ అయ్యాడేంటి..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాల ఎమోషనల్ గా మాట్లాడి అందరికి షాక్ ఇచ్చాడు. గత కొంతకాలం గా మెగా ఫ్యామిలీ ఫై కొంతమంది టార్గెట్ చేస్తూ వస్తున్న నేపథ్యం లో నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చరణ్ చాల ఎమోషనల్గా మాట్లాడాడు.


‘‘మామ అల్లు అరవింద్ ఏం మాట్లాడినా ఏదో ఒక కాంట్రవర్సీ లేపుతుంటాడు. కానీ మామ చెప్పిన దాని వెనుక ఉన్న బాధని నేను అర్ధం చేసుకోగలను. నేను ఒక్కటే చెబుతా. ఏదైనా కరెప్షన్ లేని ఇండస్ట్రీ ఉంది అంటే ఈ ప్రపంచంలో అది ఒక్క సినిమా ఇండస్ట్రీ మాత్రమే. సినిమాకి సంబంధించిన ప్రతి వ్యక్తికి ఏముంటుంది. ఉదయాన్నే 5గంటలకు లేస్తాం. జిమ్ చేస్తాం. మేకప్ వేసుకుని షాట్‌కి వెళతాం. సాయంత్రం 7, 8 గంటల వరకు పనిచేస్తాం. ఎండ, వాన అనేది లెక్కచేయకుండా కష్టపడుతూనే ఉంటాం. బన్నీకి ఎన్నో గాయాలు అయ్యాయి. నాకు తెలుసు. డ్యాన్స్‌ల వల్ల, రీస్కీ షాట్స్ వల్ల ఎన్నో గాయాలయ్యాయి. నటీనటులందరూ అంతే.

మహేష్, తారక్, ప్రభాస్.. ప్రభాస్‌కి అయితే రెండు సార్లు షోల్డర్ ఇంజురీ అయింది. నాకు తెలుసు. నాన్నగారికి మొన్న షోల్డర్ ఇంజురీ అయింది. బాలకృష్ణగారికి మొన్న షోల్డర్ ఇంజురీ అయింది. ఇలా ఒల్లు హూనం చేసుకుని కష్టపడుతూ.. మళ్లీ ఇంటికి వచ్చిన నెక్ట్స్ డే ఏం చేయాలి లేదా వర్కవుట్ చేసుకుని, ఫ్యామిలీతో ఒక గంట గడిపి, తృప్తిగా పడుకుని మళ్లీ ఉదయాన్నే షూటింగ్ వెళతాం. ఇందులో కరెప్షన్ ఎక్కడుంది చెప్పండి. ఇక్కడ ఎక్కడైనా కరెప్షన్ కనిపిస్తుందా? మీ అందరికీ తెలుసు. మీరేం అమాయకులు కారు. ఏదేదో రాస్తూ ఉంటారు. నిజమైన వ్యక్తిత్వం ఉన్నవారు దీనిని మనసులో పెట్టుకోరు. ఎవ్వరూ నమ్మరు ” అంటూ చరణ్ మాట్లాడాడు.