రకుల్ ప్రీతీ సింగ్ కు మరో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది..శంకర్ – కమల్ హాసన్ కలయికలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో నటించబోతుంది. ఈ చిత్ర షూటింగ్ ఇదివరకే మొదలైనప్పటికీ బడ్జెట్ కారణాల రీత్యా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు అన్ని సెట్ కావడం తో ఆగష్టు నెల నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసారు.
ఈ చిత్రంలో బొమ్మరిల్లు ఫేమ్ సిద్దార్థ్ ఒక కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈయనకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ను ఎంపిక చేశారు. తమిళ పరిశ్రమపై ఎక్కువగా దృష్టిపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ సినిమా లో ఛాన్స్ రావడం అదృష్టమే అని చెప్పాలి. రకుల్, సిద్దార్థ్ కలిసి నటించడం ఇదే మొదటిసారి కాబట్టి వీరిద్దరి జోడీ కొత్తగా ఉండి, అలరిస్తుందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘మన్మథుడు 2’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కింగ్ నాగార్జున హీరోగా నటించగా..రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్.