కోచ్చడయాన్‌ కు 30 కోట్లు ?

rajiniసూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రం ‘కోచ్చడయాన్‌’. రజినీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్. తాజాగా చిత్రం అఫీషియల్ పోస్టర్ లుక్ ని సౌందర్య
ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో రజినీ లుక్ టోటల్ డిఫరెంట్ గా ఉంది. కోచ్చడయాన్‌ లో రజినీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక తెలుగు లో ‘విక్రమసింహ’గా రూపుదిద్దుకుంటోన్నఈ చిత్రం తెలుగు హక్కులను అర్. సుబ్రమణ్యం దక్కించుకున్నారని సమాచారం. 30
కోట్లకు ఈ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒక డబ్బింగ్ చిత్రానికి 30 కోట్లు ఇవ్వడం ఈ చిత్రానికే చెల్లిందని, రజినీ క్రేజ్ అలాంటిదని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం రజినీ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడంలో బిజీ గా వున్నారు.