చైనాలో ప్రభంజనంకు సిద్దమైన ‘2.ఓ’

రజినీకాంత్‌ హీరోగా అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించిన ‘2.ఓ’ చిత్రం ఇండియాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. వెయ్యి, రెండు వేల కోట్లు అంటూ వసూళ్ల గురించి ప్రచారం జరిగింది. కాని 2.ఓ చిత్రం అయిదువందల కోట్ల వద్ద ఆగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం సెన్షేషన్‌ను చైనాలో క్రియేట్‌ చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. చైనాలో ఈ చిత్రంను విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ముందు నుండి కూడా జులై నెలలో ‘2.ఓ’ చిత్రాన్ని చైనాలో విడుదల చేయాలని భావించారు. అయితే అదే సమయంలో ది లయన్‌ కింగ్‌ విడుదల అయ్యింది. ఆ సినిమాతో పోటీ వద్దనుకుని 2.ఓ చిత్రంను విడుదల వాయిదా వేయడం జరిగింది. 2.ఓ చిత్రం చైనాలో తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉంటారు. చైనాలో సెప్టెంబర్‌ 6వ తేదీన ఏకంగా 47 వేల థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చైనా భాష చిత్రం కాకుండా మరో భాష చిత్రం చైనాలో ఇంత భారీగా విడుదల అవ్వడం ఇదే ప్రథమం. అక్కడ వెయ్యి కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఈ చిత్రంను విడుదల చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ మరియు హెచ్‌వై మీడియా సంస్థలు ఈ సినిమాను చైనాలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం అక్కడ ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో చూడాలి.