Site icon TeluguMirchi.com

తలైవా ఫ్యాన్స్ కు చేదు వార్త..


సూపర్ స్టార్ రజినీకాంత్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైల‌ర్‌’. నెల్స‌న్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ అతిథి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ కీల‌క క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నారు. అయితే ఇప్పుడు తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే అభిమానులకు ఇది చేదువార్తే అని చెప్పాలి.

ప్రస్తుతం ఆయన వయస్సు 72..వయస్సు పెరుగుతున్న కొద్దీ రజినీ ఆరోగ్యం కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. దీంతో ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట. ప్రస్తుతం ర‌జినీ న‌టిస్తున్న 169వ సినిమా ‘జైల‌ర్‌’. ఇక 170వ ప్రాజెక్ట్‌ని ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నారు. ఇక తన కుమార్తె ఐశ్వర్య కోసం లాల్ సలాం సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను పోషిస్తున్నారు. ఇవి కాకుండా రజినీ 171 వ సినిమాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అయితే తన చివరి చిత్రానికి దర్శకత్వం వహించమని లోకేష్ కనగరాజ్ ను స్వయంగా రజినీకాంత్ పిలిచారని తమిళ చిత్ర నిర్మాత మరియు నటుడు మిస్కిన్ వెల్లడించారు. దీంతో రజినీకాంత్ సినీప్రస్థానం ముగియబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే రజనీకాంత్ అభిమానులు మాత్రం ఇలా అనేక మార్లు ఇప్పటికే ప్రచారం జరగడంతో, ఇప్పుడు ఈ వార్త ను కూడా పూర్తిగా విశ్వసించడం లేదు.

Exit mobile version