50 లక్షల విరాళం అందజేసిన సూపర్ స్టార్ !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది, ఇప్పటికే చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు తమవంతు సాయంగా ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే తమిళ సినీ తారలు తల అజిత్, తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్, తమిళ స్టార్ హీరో సూర్య ఫామిలీ, జయం రవి ఫ్యామిలీ, శివ కార్తికేయన్, డైరెక్టర్ వెట్రిమారన్, రజనీకాంత్ కుమార్తె తమవంతు సాయంగా కరోనా రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందించారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను పర్సనల్ గా కలిసి రూ. 50 లక్షల చెక్ ను కరోనా రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు.