డా. రాజేంద్రప్రసాద్.. ఈ నటకిరీటి కథానాయకుడి పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలవైపు టర్న్ తీసుకొన్నాడు. బావ, లవ్లీ, నిప్పు, జులాయి… సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించాడు. ఇప్పుడు మరో మంచి అవకాశం దక్కింది. మహేష్బాబు తండ్రిగా నటించబోతున్నారు… ఆగడు సినిమా కోసం. మహేష్ బాబు – శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకోనున్న చిత్రం ఆగడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ కీ రోల్ పోషిస్తున్నారు. నిజానికి ఈ పాత్ర ప్రకాష్ రాజ్ కోసం రాసుకొన్నారు. శ్రీహరి మరణంతో… ఆయన పాత్ర ప్రకాష్ రాజ్ కి దక్కింది. ప్రకాష్ రాజ్ పాత్ర లో ఇప్పుడు రాజేంద్రప్రసాద్ వచ్చారన్నమాట. నవంబరు చివరి వారం నుంచీ ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. తమన్నా కథానాయికగా నటించే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.