సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘బాహుబలి’ వంటి చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనుంది. కాగా ఈ సినిమా గురించి చిత్రబృందం నుంచి అధికారికంగా ఇంకా ప్రకటన కూడా రాలేదు. కానీ వీటి చుట్టూ బోలెడన్ని రూమర్లు పుట్టుకొచ్చేశాయి. ఈ సినిమా కథ ఇదంటూ కొన్ని కల్పిత కథలు ప్రచారంలో ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ అని కొన్ని రోజులు చెప్పుకున్నారు.
ఇప్పుడు ఇది పోలీస్ స్టోరీ అంటున్నారు. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పోలీసులుగా కనిపిస్తారన్న టాక్నడుస్తోంది. దీనికి తోడు చాలా టైటిళ్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఓ కొత్త టైటిల్ వినిపిస్తోంది. అదే… `టార్గెట్` , వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఈ సినిమాలో రామ్చరణ్ సరసన రాశీఖన్నా నటించనున్నారన్న వార్త కూడా హల్చల్ చేస్తోంది.