పూజా నడుమును చెర్రీ పండుతో కొడుతా..!

హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన ‘వాల్మీకి’ చిత్రం సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో వరుణ్‌ సందేశ్‌, పూజా హెగ్డేలు జంటగా నటించారు. ‘జిగర్తాండ’ తమిళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై మెగా అభిమానులకు అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంలో శోభన్‌బాబు, శ్రీదేవిల సూపర్‌హిట్‌ సాంగ్‌ వెల్లువచ్చే గోదారమ్మా… పాటను రీమేక్‌ చేశారు. ఈ సూపర్‌హిట్‌ పాట ‘వాల్మీకి’కి చాలా ప్లస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ ముందు నుండే భావిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ రీమేక్‌ పాటను విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. పూజాను చూసిన మొదటి రోజే పెద్ద హీరోయిన్‌ అవుతుందని చెప్పాను, ఇప్పుడు అలాగే జరిగింది. పూజా నడుముపై పాట చిత్రీకరించాల్సి వస్తే నడుముపై చెర్రీ పండుతో కొడతాను అంటూ చమత్కరించారు. ఇక అప్పట్లో ఈ పాట కోసం చాలా కష్ట పడ్డాం. పాటను ఎలా తీయాలా? అని ఆలోచిస్తున్న సమయంలో పక్కనే ఇత్తడి బిందెలు తయారు చేసే షాపు ఉందని తెలిసింది. దాంతో అలా బిందెలతో పాటను చిత్రీకరించాం. ఈ పాటలో వాడినన్ని బిందెలలో డబ్బులు పుష్కలంగా నిండాలని కోరుకుంటున్నా అంటూ రాఘవేంద్రరావు నిర్మాతలను దీవించారు. తాజాగా విడుదలయిన వెల్లువచ్చే గోదారమ్మా… పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.