యంగ్ హీరో శర్వానంద్ తాజాగా ‘రాధ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. కొత్త దర్శకుడు చంద్రమోహన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి శర్వానంద్తో రొమాన్స్ చేసింది. కామెడీతో పాటు లావణ్య అందాలు కూడా ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యాయి. కానీ ‘బాహుబలి’ తుపాను ప్రభావం పూర్తిగా తగ్గకపోవడం, ‘రాధ’ కథ రోటీన్గా ఉండడంతో కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. తొలివారాంతపు కలెక్షన్లు మాత్రం పర్వాలేదన్నట్టుగానే ఉన్నాయి.
‘రాధ’ చిత్రం విడుదలయిన తొలి వారాంతంలో తెలుగు రాష్ట్రాలను కలుపుకుని మొత్తం 4.5కోట్ల షేర్ను వసూలు చేయగా మిగతా ఏరియాల్లో సుమారు 60లక్షలను రాబట్టింది. మొత్తంగా ‘రాధ’ చిత్రం మొదటి వారాంతంలో దాదాపుగా 5.1కోట్ల షేర్ను రాబట్టింది. ఈ లెక్కన చూసుకుంటే శర్వా కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘శతమానం భవతి’ చిత్రం తొలి వారాంతంలో 7.15కోట్లను రాబట్టింది. పండగ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్లో భారీ కలెక్షన్లు రాబట్టింది. దీన్ని బట్టి చూస్తే ‘రాధ’ పాజిటివ్ టాక్ తగ్గట్టుగానే ‘శతమానం భవతి’ కంటే 2కోట్లు తక్కువగా వచ్చాయి. దీంతో కూడా పెద్దగా నష్టం ఏమి లేదు అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.