గత పది రోజులుగా పూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త తెగ చక్కర్లు కొడుతున్నప్పటికీ దీని ఫై పూరి గాని విజయ్ గాని స్పందించకపోయేసరికి నిజామా కదా అనే సందేహం లో అభిమానులు ఉండిపోయారు. కానీ ఈ వీరిద్దరి కాంబో ఫిక్స్ అని ఛార్మి అధికారికంగా తెలియజేసి నిజం చేసింది.
రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరి. రామ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా రికార్డు నెలకొల్పడం తో మొన్నటి వరకు పూరి తో దూరంగా ఉన్న వారంతా ఇప్పుడు పూరి తో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
మరి పూరి విజయ్ ను ఏ జోనర్ లో చూపిస్తాడో… సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.
It’s official ????
Today is really happpyyyyy happyyyyy #Eid ???@TheDeverakonda @purijagan @PuriConnects #PCfilm #EidMubarak pic.twitter.com/NfX34DBnrl— Charmme Kaur (@Charmmeofficial) 12 August 2019