పూరి కి మాటఇచ్చిన పవన్..మరోసారి బద్రి రిపీట్ కాబోతుందా..?

పూరి – పవన్ కాంబినేషన్ అంటే పవన్ అభిమానులకు పండగే. వీరిద్దరి కలయికలో వచ్చిన బద్రి సినిమా ఇప్పటికి ఎవర్ గ్రీన్ మూవీ అనే చెప్పాలి. బద్రి తర్వాత చాల గ్యాప్ తర్వాత వీరిద్దరి కలయికలో కెమెరా మెన్ గంగతో రాంబాబు మూవీ వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికి అప్పటి రాజకీయ పరిస్థితుల మధ్య ఈ సినిమా పెద్దగా కమర్షియల్ గా హిట్ అనిపించుకోలేకపోయింది.

తాజాగా మరోసారి వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుందనే వార్త అభిమానులను సంతోషం లో పడేస్తుంది. రీసెంట్ గా పవన్ రీ ఎంట్రీ కి ఫిక్స్ అయినా సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫిలిం పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. కాగా కొద్దిరోజుల క్రితం ఓ సినిమా విషయమై పూరి, పవన్ ని కలిసారని, ప్రస్తుతానికి తాను ఒప్పుకున్న ప్రాజక్ట్స్ పూర్తి అవ్వగానే మీతో సినిమా చేస్తానని పవన్ మాటిచ్చారని కొందరు అంటున్నారు. ఇక ఆ సినిమా కోసం అతి త్వరలో పూర్తి స్థాయిలో కథని డెవలప్ చేసే పనిలో ఉన్నారట పూరి. అన్నీ కలిసి వస్తే, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ తో ఫైటర్ మూవీ చేసే పనిలో ఉన్నాడు.