మొండోడు కు పూరి పంచ్

purijagandh and srikanthహీరో శ్రీకాంత్ కధానాయకునిగా రూపొందుతున్న చిత్రం మొండోడు. జర్నలిస్ట్ ప్రభు దర్సకత్వం వహిస్తున్నారు. దర్శకుడు పూరీ జగన్నాధ్ మొండోడు కు వాయిస్ ఓవర్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..’ ఒక మంచి కదా చిత్రం గా ఈ మొండోడు ఉంటుందని అన్నారు. హీరో శ్రీకాంత్ పాత్ర చిత్రణ కొత్తగా ఉంటూ ఆసక్తిని కలిగిస్తుందని అన్నారు. దర్శకుడు పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ అందించటం పట్ల తన సంతోషాన్ని, కృతజ్ఞతను వెలిబుచ్చారు. దర్శకుడు జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ..’ ఈ చిత్రం లో హీరో శ్రీకాంత్ పాత్ర పరిచయ దృశ్యాలకు, అలాగే చిత్రం ముగింపు సందర్భంలోనూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ స్వరాన్ని అందించారు. చిత్రానికి సంభందించిన కీలక దృశ్యాలలో ఆయన స్వరం వినిపిస్తుందని చెప్పారు. ఈ చిత్రం ఈ నెల మూడవ వారంలో విడుదలకు సిద్ద మవుతోంది.