జ్యోతిలక్ష్మి చిత్రంతో పూరి కి బాగా దగ్గరయింది ఛార్మి. ఏకంగా తన స్క్రిప్ట్ , పర్సనల్ పనులు కూడా చూసుకునేంతగా దగ్గరయింది. దీంతో పూరి తాను తీయబోయే చిత్రాలకు సహా నిర్మాతగా ఉండాలని చెప్పాడట. కానీ అసలు నిర్మాతలు కుదరదని చెప్పడం తో అమ్మడిని అలా ఖాళీగా ఉంచడం ఎందుకని తన సినిమాలకు సంబంధించిన నటి ,నటుల ఎంపిక ను చూసుకునే బాధ్యత అప్పగించాడట. ప్రస్తుతం ఛార్మి ఆ పనిలో ఉండగానే , హీరోయిన్స్ కి మేనేజర్ గా కూడా వ్యవహరిస్తానని పబ్లిక్ చెబుతుందట..మొత్తానికి పూరి -ఛార్మిల కొత్త బిజినెస్ బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది మరి.