Site icon TeluguMirchi.com

పూరి, రౌడీ అప్పుడే మొదలెట్టేశారా?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో సంచలన సక్సెస్‌ను దక్కించుకున్న పూరి జగన్నాధ్‌ తన తదుపరి చిత్రంను రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఛార్మీ మరియు పూరిలు ఈ చిత్రంకు నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. అయితే ఈ చిత్రం ప్రస్తుతం విజయ్‌ చేస్తున్న క్రాంతి మాధవ్‌ సినిమా విడుదలైన తర్వాత మొదలవ్వనుందని ప్రచారం జరిగింది. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమా పనులు అప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తుంది.

తాజాగా పూరి జగన్నాధ్‌ మరియు విజయ్‌ దేవరకొండలు కలిశారు. కలవడంతో పాటు కొన్ని ప్రాంతాలు తిరిగి లొకేషన్స్‌ను పరిశీలించారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యిందని, త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లే ఉద్దేశ్యంతో ఇలా లొకేషన్‌ సీయింగ్‌కు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మొన్నటి వరకు వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లోనే సినిమా విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి అధికారిక ప్రకటన ఎప్పుడో చూడాలి.

Exit mobile version