ఎన్టీఆర్ ఆ ఎనర్జీ ఇస్తాడు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘టెంపర్‌’. 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నేటికి మూడేళ్లు కావొస్తోంది.

ఈ సందర్భంగా ‘టెంపర్‌’ సినిమాను ఉద్దేశిస్తూ పూరీ జగన్నాథ్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘నా సినిమాల జాబితాలో ‘టెంపర్‌’ గర్వించదగ్గ చిత్రం. ఓ నటుడిగా తారక్‌ నాకు ఆ ఎనర్జీ ఇస్తాడు. వక్కంతం వంశీకి, అభిమానులకు ధన్యవాదాలు’ అని పూరీ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి రీమేక్‌ చేస్తున్నారు. దీనికి ‘సింబా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్న సనగతి తెలిసిందే.