Site icon TeluguMirchi.com

డైరెక్టర్ ఒడిలో సేద తీరుతున్న బ్రహ్మాజీ..

విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్న నటుడు బ్రహ్మజీ. సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ..ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ లలో పదుల సంఖ్య సినిమాల్లో నటించి ఆకట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ నటుల్లో ఈయన ఒకరు. చేతనిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న బ్రహ్మాజీ..భీష్మ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో సేద తీరుతూ కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు.

నితిన్ – రష్మిక జంటగా వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన భీష్మ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రీ రిలీజ్ వేడుక వైభవం గా జరిగింది. ఈ వేడుక లో డైరెక్టర్ వెంకీ ఒడిలో బ్రహ్మాజీ సేద తిరుతున్నట్లు కనిపించాడు. ఈ పిక్ ను బ్రహ్మాజీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి ప్రశాంతంగా అంటూ టాగ్ పెట్టాడు.

Exit mobile version