మహేష్ బాబు కథానాయకుడిగా నటించే చిత్రం ఆగడు. 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. శ్రీనువైట్ల దర్శకుడు. ఈ సినిమాలో శ్రీహరి కీ రోల్స్ పోషించాల్సింది. అయితే… శ్రీహరి మరణంతో ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలా…? అని చిత్రబృందం తర్జన భర్జనలు పడింది. చాలామంది నటుల పేర్లు పరిశీలించారు. ఒక దశలో సాయికుమార్నీ అనుకొన్నారు. అయితే చివరికి ఆ స్థానం ప్రకాష్ రాజ్కి దక్కినట్టు సమాచారమ్. శుక్రవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. మహేష్ బాబు సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. 2014 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.