అల్లు అర్జున్ – బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో వచ్చిన చిత్రం పరుగు. తెలుగు నాట కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకొందీ చిత్రం. ఇప్పుడు హిందీలో హీరోపంటి అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. జాకీ ష్రాఫ్ తనయుడు ‘టైగర్ ష్రాఫ్’ హీరోగా పరిచయం అవుతున్నాడు. తెలుగులో కథానాయిక తండ్రిగా నటించిన ప్రకాష్రాజ్.. హిందీలోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సంభందించి తనపాత్రకు ‘ప్రకాష్ రాజ్’ గత రెండు రోజులుగా హైదరాబాద్ లోని ‘శబ్దాలయ’ ధియేటర్ లో డబ్బింగ్ చెబుతున్నారు. ఈ చిత్రంలో ‘కృతి సనన్’ (మహేష్ బాబు ‘వన్’ నాయిక) నాయికగా నటిస్తున్నారు. హిందీ లో ఆమెకిది తొలి చిత్రం. మే నెలలో విడుదలకాబోతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తుండగా సబ్బిర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.