ప్రియమణి కథానాయికగా నటించిన చిత్రం చండీ. సముద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని గీతాల్ని ఆగస్టు 12న విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విద్యాబాలన్ రానుందని సమాచారమ్. ప్రియమణి బాలీవుడ్లో చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. అప్పటి నుంచీ వీరిద్దరికీ మంచి స్నేహం ఉందట. పైగా ఇదో నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రం. అందుకే విద్యాబాలన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్నీ ఇదే వేడుకలోచూడొచ్చు. ఈ సినిమాలో కృష్ణంరాజు ఓ కీలక పాత్ర పోషించారు. అందుకే.. ప్రభాస్ రాక ఖాయమైంది.