‘సాహో’ క్యాన్సిల్‌ అంటూ దర్శకుడిని హెచ్చరించిన ప్రభాస్‌

‘బాహుబలి’ చిత్రంతో కేవలం తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్‌ తదుపరి చిత్రాన్ని యువ దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో చేయనున్న విషయం తెల్సిందే. మూడేళ్ల క్రితమే ప్రభాస్‌ సుజిత్‌కు మాట ఇచ్చాడట. ఈ చిత్రానికి ‘సాహో’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను కూడా పిక్స్‌ చేసి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. అయితే ఈ చిత్రం క్యాన్సిల్‌ కాబోతుంది అని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తుంది. దర్శకుడు సుజిత్‌ కుర్రతనంతో ఊరికే కథలో మార్పులు చేసి తరుచూ కథనాన్ని మార్చుతూ హీరోకు వినిపిస్తున్నాడట.

ఊరికే ఉండలేక సుజిత్‌ ఇప్పటికే పలుసార్లు కథను మార్చి మార్చి ప్రభాస్‌కు వినిపించాడట. దాంతో ఆగ్రహించిన ప్రభాస్‌ మొదట వినిపించిన కథతోనే మొత్తం స్క్రిప్టు రెడీ చేసి నా దగ్గరకు తీసుకురా, తరుచుగా ఈ మార్పులేంటి, ఇలా అయితే ‘సాహో’ను క్యాన్సిల్‌ చేసేద్దాం అంటూ దర్శకుడిని హెచ్చరించాడట. అనుభవ లోపంతో ప్రభాస్‌ను హీరోగా చూపించడంలో సుజిత్‌ కాస్త తడబడుతున్నాడని, తరుచూ కథను మారిస్తే కథనంలో లోపాలు వస్తాయని సినీ ప్రముఖులు సైతం విమర్శిస్తున్నారు. మరి సుజిత్‌ ‘సాహో’ కథను సమర్థవంతంగా తెరకెక్కించగలడా..?? లేదా అని ప్రభాస్‌ అభిమానులు సందేహ పడుతున్నారు.