మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్… ఇలా అందరూ స్టార్లే! ఎవరి క్రేజ్ వాళ్లకుంది. ఎవరి డిమాండ్ వారిది. అయితే ఇందులో ప్రభాస్ రేంజే వేరు! చాప కింద నీరులా తన స్టామినా పెంచుకొంటూ వచ్చాడీ రెబల్ స్టార్. అది ఇప్పుడు బాహుబలి రేంజుకు చేరింది. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా కోసం ప్రభాస్కు ముట్టిన పారితోషికం ఎంతో తెలుసా?? అక్షరాలా రూ.20 కోట్లు! మహేష్ బాబు, ఎన్టీఆర్ లపారితోషికం కంటే ఇదెంతో ఎక్కువ. ‘మిర్చి’తో ప్రభాస్ రేంజు అంతనంత ఎత్తుకు ఎదిగింది. ఈ సినిమా తరవాత అతనికి రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధపడ్డారు. కానీ ‘బాహుబలి’ వల్ల ప్రభాస్ మరో సినిమా ఒప్పుకోలేదు. బాహుబలికి ప్రభాస్ కు రూ.20 కోట్లు ముట్టాయనేది లేటెస్ట్ టాక్. ఎందుకంటే ఇది చిన్నా చితకా సినిమా కాదు. పైగా ప్రభాస్ అన్ లిమిటెడ్ కాల్సీట్లు ఇచ్చాడు. అంటే ఈ సినిమా పూర్తయ్యే వరకూ మరో సినిమా ఒప్పుకోకూడదన్నమాట. అందుకే రూ.20 కోట్లు ముట్టాయి. బాహుబలి హిట్టయితే.. ప్రభాస్ ఇదే రేంజు కొనసాగించే అవకాశాలున్నాయ్.