ప్రభాస్ హామీ ఇచ్చాడట..

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేజ్ భారీగా పెరిగింది. ప్రభాస్ తో సినిమా అంటే కనీసం రూ. 200 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు చిన్న నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సాహో చిత్రం రూ. 300 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా..రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కున్న చిత్రాన్ని రూ. 200 కోట్ల బడ్జెట్ తో గోపికృష్ణ బ్యానర్ ఫై కృష్ణంరాజు నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసేందుకు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో దిల్ రాజు బ్యానర్ లో మున్నా, మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలను నిర్మించగా..అందులో మిస్టర్ ఫర్ఫెక్ట్ సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ప్రభాస్ సినిమాలు చేద్దామని అనుకున్నప్పటికీ ప్రభాస్ వరుస బిజీ చిత్రాలతో ఉండడం కుదరలేదు. ఇప్పుడు చాల గ్యాప్ తర్వాత దిల్ రాజు కు ప్రభాస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మంచి కథ తీసుకురండి సినిమా చేద్దామని మాట ఇచ్చారట. ప్రభాస్ హామీ తో కథల ఫై వేట మొదలు పెట్టాడట దిల్ రాజు. మరి రాజు గారు ఎలాంటి కథ ను తీసుకొస్తాడో చూడాలి. ప్రస్తుతం దిల్ రాజు సాహో నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ను సొంతం చేసుకున్నాడు .