Site icon TeluguMirchi.com

‘జాను’ గురించి ప్రభాస్‌ ఏమన్నాడంటే..!

ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో పాటు చేసిన ‘జాను’ చిత్రం గురించి గత రెండు మూడు నెలలుగా పూర్తిగా పక్కకు పెట్టేశాడు. 350 కోట్ల బడ్జెట్‌తో ‘సాహో’ చిత్రంను చేసిన ప్రభాస్‌ మరో వైపు రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాను’ చిత్రంను కూడా చేసిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం గురించి పెద్దగా ఎలాంటి విషయాలు రివీల్‌ కాలేదు. కాని తాజాగా సాహో చిత్రం ప్రమోషన్‌లో భాగంగా జాను గురించి ప్రభాస్‌ కొన్ని విషయాలను మీడియాతో షేర్‌ చేసుకుని సినిమాపై అంచనాలు పెంచాడు.

జాను చిత్రం కూడా భారీ బడ్జెట్‌ మూవీ అన్నాడు. సాహో స్థాయి బడ్జెట్‌ కాకున్నా కూడా ఆ చిత్రం కోసం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఒక విభిన్నమైన ప్రేమ కథను హై స్టాండెర్డ్‌ బడ్జెట్‌తో చూపించబోతున్నట్లుగా ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటలీలో ఎక్కువ చిత్రీకరణ జరుపుతున్నారు. దాదాపుగా 100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా సంక్రాంతికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.

Exit mobile version