Site icon TeluguMirchi.com

బాహుబలి సినిమాను తట్టుకొని నిలబడ్డ చిత్రం ఇదే..

రాజమౌళి తెరకెక్కించిన బాహుబ‌లి: ది కంక్లూజ‌న్ మూవీ వరల్డ్ వైడ్ గా వ‌సూళ్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెల్సిందే…ఇప్పటికే మొదటి వారానికి గాను దాదాపు వెయ్యి కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు సాధించి తెలుగు సినిమా స‌త్తాను చాటింది. బాహుబలి దెబ్బ‌కు దేశ‌వ్యాప్తంగా ఇత‌ర అన్ని భాషల చిత్రాలన్నీ విలవిలాడుతున్నాయి. అయినాగానీ బాహుబలి ని తట్టుకొని తమిళ్ సినిమా నిలబడి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది…అదే ర‌జినీకాంత్ అల్లుడు ధ‌నుష్ నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, న‌టించిన ప‌వ‌ర్‌పాండీ.

త‌మిళ‌నాట బాహుబ‌లి క్రేజ్‌ను ఎదుర్కొని రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది ఈ సినిమా. బాహుబ‌లి-2 కంటే రెండు వారాల ముందు ఈ సినిమా విడుద‌లైంది. మొద‌టి షో నుంచే సూప‌ర్ హిట్‌ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాహుబ‌లి-2 విడుద‌ల‌య్యాక కూడా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ప‌వ‌ర్‌ఫుల్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు త‌మిళ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మూడు వారం లోను మంచి వసూళ్లతో ప‌వ‌ర్‌పాండీ..తన పవర్ ను చూపిస్తుంది.

Exit mobile version