మనోజ్ పోటుగాడిగా తన ప్రతాపం చూపించబోతున్నాడు. పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మాత. ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 25న విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో అతిరధమహారథులు సమక్షంలో పాటల పండుగ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మూడు పాటలు యూ ట్యూబ్లో నేరుగా విడుదల చేశారు. ఒక పాటని.. మనోజ్ ఆలపించారు. మరోపాట ప్రముఖ తమిళ కథానాయకుడు శింబు ఆలపించారు. మనోజ్ పక్కన అయిదుగురు అమ్మాయిలు కథానాయికలుగా నటిస్తున్నారు. సెప్టెంబరు మొదటి వారంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.