రామ్చరణ్ లేటెస్ట్ చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకుడు. సమంత హీరోయిన్. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ వుంది. ఇందులో పూజాహెగ్డేఆడిపాడుతుంది. ‘జిల్ జిల్ జిగేల్’ అని సాగే ఈ పాట చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.
కాగా ఈ ఒక పాటలో నటించేందుకు పూజ తీసుకున్న పారితోషికం టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఆమె ప్రత్యేక గీతానికి రూ.50 లక్షలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక పాటకి యాబై లక్షలు అంటే చాలా పెద్ద ఎమౌంట్. దాదాపు 50 సినిమాల్లో కథానాయికగా నటించిన కాజల్ ‘జనతా గ్యారేజ్’ సినిమాలోని స్పెసల్ సాంగ్కు రూ.50 లక్షలు తీసుకుంది. అలాంటిది ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ ఒక్క హిట్ అందుకున్న పూజ అంత మొత్తం డిమాండ్ చేయడం విశేషమే మరి.