Site icon TeluguMirchi.com

అమ్మడు కావాలంటే కోటి ఇవ్వాల్సిందే

సక్సెస్ తో సంబంధం లేకుండా తెలుగులో చక్కటి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది పూజా హెగ్డే. 2014లో విడుదలైన ముకుందా చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది ఈ పూజ. ఈ సినిమా పరాజయం పాలైనా తన గ్లామర్తో పాటు అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఇప్పుడు అల్లు అర్జున్‌కు జోడీగా డీజే దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో నటిస్తున్నది. మూడేళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌లో పూజ చేస్తున్న సినిమా ఇది.

అయితే ఇప్పుడు పూజ రెమ్యునిరేషన్ కు సంబధించి ఓ హాట్ న్యూస్ వినిపిస్తుంది. పూజా హెగ్డే పారితోషికాన్ని భారీగా పెంచినట్లు చెబుతున్నారు. ఇపుడు సినిమా కోసం కోటి రూపాయల పారితోషికాన్ని అడుగుతున్నట్లు సమాచారం. డీజే కోసం అరవై లక్షల రెమ్యునరేషన్‌ను స్వీకరించిన అమ్మడు… ఆమె బెల్లంకొండ శ్రీనివాస్, దర్శకుడు శ్రీవాస్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా కోసం కోటి అడిగిందట. అయితే ఆమె అడిగిన రెమ్యునిరేషన్ ఇవ్వాలని డిసైడయ్యారట చిత్ర నిర్మాతలు.

Exit mobile version