పూజా హెగ్డే ఇప్పుడు అదిరిపోయే క్రేజ్ లో ఉంది. ‘ముకుందా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా.. డిజేతో కమర్షియల్ మెరుపులు మెరిపించింది. దీంతో ఇప్పుడు అందరి లుక్కూ పూజాపై పడింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో పూజాని ఫైనల్ చేశారు. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాలో పూజానే హీరోయిన్. జిల్ ఫేం రాధకృష్ణ, ప్రభాస్ తో యువీకి క్రియేషన్ లోనే ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు ఈసినిమాలో కూడా పూజానే హీరోయిన్ .
ప్రస్తుతం తనకు వస్తున్న ఆఫర్స్ పై స్పదించింది పూజా. తెలుగులో చాలా పెద్ద స్టార్స్తో నటించబోతున్నా. బాలీవుడ్ ఖాన్స్లాంటి స్టార్స్తో నటిస్తున్నట్లు భావిస్తున్నా. వారు ఇక్కడ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లాంటి వారు” అంటూ చెప్పుకొచ్చారు.