Site icon TeluguMirchi.com

రంగస్థలంలో పాలిటిక్స్


రామ్‌చరణ్‌, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మొన్న సమంత పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన టీజర్‌ను విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. తర్వాత ‘యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకెబిందెలాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె” అంటూ మరో పాట విడుదల చేశారు. ఈ పాట కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

కాగా ఈ సినిమా గురుంచి ఓ ఆసక్తికరమైన సంగతి తెలుస్తుంది. ఈ సినిమాలో రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ పాటిటిక్స్ ఈ మొవీలో ఉన్నాయంట. సర్పంచ్ ఎన్నికల సన్నివేశాలు ఈ సినిమాలో ప్రధానంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తోంది. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version