శ్రుతి హషన్ కేసు ఎక్కడికొచ్చింది !

sruthi
హీరోయిన్ శ్రుతి హషణ్ ఇటివలే ఓ పోలీసు కేసు నమోదు చేసింది. రామ్ చరణ్‌తేజ్ కలిసి తాను నటించిన ‘ఎవడు’ చిత్రంలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలను గుర్తు తెలియని వ్యక్తులు ఇంటర్నెట్ లో పెట్టారంటూ శ్రుతిహాసన్ కొద్దిరోజుల క్రితం సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కేసు వేగవంతమైయింది. సైబర్ విభాగం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు ఒకరిద్దరు ఫోటో గ్రాఫర్స్ పిలిపించి విచారించారు. సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు ఫొటోలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. న్యాయ విభాగం సూచనలు, ఫోరెన్సిక్ ప్రయోగశాల ఫలితాలొచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐడీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ కేసుకు ఎలాంటి ముగింపు దొరుకుతుందో చూడాలి.