మహేష్ చేతుల మీదుగా సీతమ్మ ప్లాటినం పండగ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మహేష్ బాబు చేతుల మీదుగా విజయవాడలో జరుపబోతున్నట్లు సమాచారం. మహేష్ ఈ నెల 16న అంటే సంక్రాంతి సందర్భంగా విజయవాడలో జోస్ఆలుకాస్ భవనాన్ని ప్రారంభించనున్నాడు. దానికి ఆయన యాడ్ ప్రమోటర్గా ఉన్నాడు. పనిలోపనిగా అదేరోజు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్లాటినం డిస్క్ కూడా జరిపే ఆలోచనలో నిర్మాత దిల్రాజు ఉన్నాడు. ఈ రెండు కార్యక్రమాలు చేయడంతో మహేష్ బాబు రావడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుజాగ్రత్తచర్యగా పోలీసు బందోబస్తుకు పర్మిషన్ తీసుకున్నారు. సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విడుదలకాబోతున్న ఈ చిత్రం పై అటు మహేష్ అభిమానుల్లోనూ ఇటు వెంకీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.