దీనికి తోడు సినీ సెలబ్రిటీలు సైతం సినిమా బాగుందని తమ సోషల్ పేజీలలో పోస్ట్ చేయడం తో ఇంకాస్త సినిమా ఫై అందరి దృష్టి పడింది. ముందుగా చిత్ర దర్శకులు తరుణ్ భాస్కర్ ఈ చిత్ర కథ ను టాలీవుడ్ యంగ్ హీరోలకు ముందుగా వినిపించిన కానీ ఎవరికీ పెద్దగా నచ్చలేదట. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కు వినిపించి ఓకే చేయించాడు. అయితే ఇప్పుడు ఆ హీరోలే సినిమా చాల బాగుంది..డైరెక్టర్ బాగా తీసాడని చెప్పడం తో తరుణ్ షాక్ అవుతున్నాడట.
సురేష్ బాబు సమర్పణ లో వచ్చిన ఈ చిత్రం రోజు రోజుకి కలెక్షన్స్ బాగా పెరిగిపోతున్నాయట. చాల ఏరియాల్లో సినిమా థియేటర్స్ ను పెంచినట్లు సమాచారం. కథ బాగుంటే చిన్న చిత్రం కూడా పెద్ద విజయం సాదిస్తుందని మరోసారి రుజువయ్యింది.