ప‌వ‌న్ క‌ల్యాణ్ అతిథిగా

Untitled-1ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరుని, ఇమేజ్‌ ని వీలైనంత వాడుకోవాల‌ని చూస్తున్నాడు వైవిఎస్ చౌద‌రి. ‘రేయ్’ సినిమాలో చికితా టీజ‌ర్‌ తో ప‌వ‌న్ ఫ్యాన్స్ ని అల‌రించాడు. ఇప్పుడు ప‌వ‌న్‌ తో రేయ్ ఆడియో విడుద‌ల చేయిస్తున్నాడు. వైవిఎస్ ద‌ర్శక‌త్వం వ‌హించిన చిత్రం రేయ్‌. చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడు. ఈ చిత్రంలోని గీతాల్ని ఈ వారంలోనే విడుద‌ల‌చేయ‌నున్నారు. ఈ కార్యక్రమానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ అతిథిగా వ‌స్తాడ‌ని టాక్‌. చౌద‌రి మీద‌, సాయిధ‌ర‌మ్ మీద ఉన్న అభిమానంతో ఈ వేడుక‌కు వ‌స్తాన‌ని ప‌వ‌న్ మాటిచ్చాడ‌ట‌. మొత్తానికి వ‌వ‌న్ రాక‌… రేయ్‌కి మ‌రింత క్రేజ్ తీసుకురావ‌డం ఖాయం. పెళ్లివార్త తెలిసిన త‌ర‌వాత ప‌వ‌న్‌ ని వేదిక మీద చూడ‌డం ఇదే మొద‌టిసారి. ఆరోజు… కొత్త పెళ్లికొడుకుని చూసేద్దాం..!