తన సినిమాల్లో తరచూ గొంతు విప్పి ఓ తమాషా పాట పాడడం పవన్ కల్యాణ్కి అలవాటే! తమ్ముడు, జానీ, ఖుషీ సినిమాల్లో జానపద గీతాలు ఆలపించి హుషారు తెప్పించాడు. అలాంటి పాట అత్తారింటికి దారేదిలో కూడా ఉందా?? ఔననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. ఈ సినిమాలో పవన్ చేత ఓ పాట పాడించడాడట దేవిశ్రీ ప్రసాద్. అయితే ఆ పాటని ఆడియో లో వినిపించుండా గొంతు నొక్కేశారు. ఒక్కసారి షాక్ ఇవ్వడానికి నేరుగా సినిమాలోనే వినిపిస్తారట. ఈ సినిమాలో అదిరిపోయే పాట ఉంది. అది ఎవరికీ వినిపించకుండా దాచేశారు… అని ఆడియో విడుదల వేడుకలో… బ్రహ్మానందం హింట్ ఇచ్చాడు. ఆ పాట ఇదేనని అభిమానుల నమ్మకం.