రామ్చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కొణిదెల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. చిరు, సురేఖ దంపతులు తమ తనయుడికి కానుక ఇచ్చారు. చెర్రీ సతీమణి ఉపాసన ఆయన్ను ‘MRC’ అంటూ సర్ప్రైజ్ చేశారు. ఇదే సందర్భంగా పవన్కల్యాణ్.. చిరు ఇంటికి వచ్చారు. చెర్రీని ఆశీర్వదించారు.
ఈ విషయాన్ని ఉపాసన ఫేస్బుక్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘కొణిదెల కుటుంబ సభ్యుల బంధం. అత్తమ్మ వండిన అద్భుతమైన లంచ్. పుట్టినరోజు శుభాకాంక్షలు మిస్టర్ సి’ అని ట్వీట్ చేస్తూ.. దీంతోపాటు చిరు దంపతులు, పవన్, చెర్రీ కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.
దీంతో పాటు జూబ్లీహిల్స్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో అల్లు అరవింద్ పాల్గొని, కేక్ కట్ చేశారు. ఆయనతోపాటు ‘రంగస్థలం’ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ తదితరులు ఉన్నారు.