అత్తారింటికి దారేది తో మళ్లీ ఫేమ్లోకి వచ్చింది.. ప్రణీత. అందులో క్యూట్ క్యూట్గా కనిపించింది. ఆ వెంటనే రభసలో ఛాన్స్ అందుకొంది. ఇప్పుడు మరోసారి ఈ బాపు బొమ్మకి…. త్రివిక్రమ్ నుంచి పిలుపు అందినట్టు సమాచారమ్. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కథానాయికగా సమంతను ఎంచుకొన్నారు. రెండో నాయికగా ప్రణీత పేరు పరిశీలిస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారమ్. అత్తారింటికి దారేది తరవాత త్రివిక్రమ్ – ప్రణీత బాగా క్లోజ్ అయ్యారట. ప్రణీత కెరీర్ ప్లాన్ కూడా త్రివిక్రమ్ డిజైన్ చేస్తున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ వల్లే… బన్నీ సినిమాలో ప్రణీతకు ఛాన్స్ దక్కిందని చెప్పుకొంటున్నారు. సమంత సినిమాలో రెండో నాయికగా ప్రణీతకు హ్యాట్రిక్ సినిమా అన్నమాట. ప్రణీత ఎంపిక విషయాన్ని చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.