ఆడియో వేడుకలు జరుపుకోవడం పవన్ కల్యాణ్కి ఇష్టం ఉండదు. అభిమానులు ఇబ్బంది పడతారని – ఆయన ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటారు. ఎలాంటి హడావుడి లేకుండా పాటల్ని విడుదల చేస్తారు. జల్సా నుంచీ కాస్త మనసు మార్చుకొని వేడుకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ‘అత్తారింటికి దారేది’ ఆడియో మాత్రం హడావుడి లేకుండా గప్చుప్ గా విడుదల చేయాలని పవన్ డిసైడ్ అయ్యాడట. ఆ సంగతి తెలిసి… పవన్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అయితే ఇప్పుడు పవన్ తన మనసు మార్చుకొన్నాడని సమాచారమ్. ఆడియో వేడుకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే – అక్కడ ఎలాంటి తప్పులు జరక్కుండా చూడాలని నిర్మాతకు గట్టిగా చెప్పాడట. అంతే కాదు.. ఈ డాన్సింగు గోలలు కూడా వద్దు అన్నాడట! ఎన్ని షరతులు విధించినా ఒప్పుకొన్నాడు సంతోషం… అని చిత్రబృందం హ్యాపీగా ఫీలౌతోంది.