పవన్ కు సిం.ఎం కాల్ !

pavanరాష్ట్ర రాజదాని హైదరాబాద్ లో అంతర్జాతీయ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుజరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రం లో పరిస్థితులు విభజన చుట్టూ తిరగడం తో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనుకున్నంత మీడియా కవరేజ్ రావడంలేదు. నవంబర్ 14న ప్రారంభం అయిన ఈ ఫెస్టివల్ కు ప్రచారం, కవరేజి పెద్దగ లేదనే చెప్పాలి. గత వారంరోజులుగా ఈ ఫెస్టివల్ మన రాజధానిలో జరుగుతున్నా మన సెలెబ్రెటీలు ఎవ్వరూ ఈ ఉత్సవం వైపు ఆసక్తి చూపలేదు. దీంతో ముగింపు వేడుకనైన గ్రాండ్ గా జరపాలని అధికారులు బావిస్తున్నారు. ఈ నేపధ్యం లో ఈరోజు జరగబోతున్న ముగింపు ఉత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్న చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ముఖ్య అతిధిగా పిలిచినట్లుగా వార్తలువినిపిస్తున్నాయి. ఈ విషయం పై రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా పవన్ తో మాట్లాడారట. పవన్ అభిమానుల క్రేజ్ రీత్యా ఈ వార్తను చివరి నిముషంలో ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ వారం రోజుల్లో రావాల్సిన కవరేజి పవన్ రాక తో ఒక్క రోజులో వచ్చేయడం ఖాయమంటున్నారు నిర్వాహకులు.