దేవస్థానం సినిమాతో ఓ ఫీల్గుడ్ మూవీ అందించారు జనార్థన మహర్షి. ఇప్పుడు పవిత్ర సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు. శ్రియ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. సాయికుమార్, రోజా, ఏవీఎస్ ప్రధాన పాత్రలు పోషించారు. వచ్చేనెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పవిత్ర ప్రచార చిత్రాలు ఆదివారం ప్రసాద్లాబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ… ”ఇదో బూతు సినిమా అనుకొంటున్నారు. దేవస్థానంలాంటి సినిమా తీసి, ఇప్పుడు ఓ బూతు సినిమా ఎందుకు తీస్తున్నావ్? అంటూ విమర్శలు గుప్పించారు. వారందరికీ ఇదో చెంపపెట్టు. ఎటువంటి అసభ్యతకూ, అశ్లీలానికి తావు లేకుండా రూపొందించిన చిత్రమిది. మే 10న విడుదల చేస్తున్నాం“ అన్నారు. నటుడు ఏవీఎస్ మాట్లాడుతూ `శ్రియ పైట జార్చి పైసలు సంపాదించడానికి తీసిన సినిమా కాదిది. సినిమా అవుట్పుట్ తీసిన తరవాత కూడా నిర్మాతలు ఇంత సంతోషంగా ఉన్నారంటే సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో నేను కూడా ఓ మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంద”న్నారు.