ఇది వరకు వంద కోట్ల క్లబ్ లో చేరడం బాలీవుడ్ సీమకే చెల్లేది. షారుఖ్, సల్మాన్, అమీర్ వీళ్లంతా సెంచరీ కొట్టారు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ వారి సరసన చేరబోతున్నాడు. టాలీవుడ్కి తీరదేమో అన్న వంద కోట్ల కల…. పవన్ తీరుస్తున్నాడు. అత్తారింటికి దారేది సినిమా మంగళవారంతో 25 రోజుల మార్కు చేరుకొంది. దాదాపు రూ.75 కోట్ల వసూళ్లు సాధించినట్టు సమాచారమ్. మా సినిమా వంద కోట్లు సాధించడం ఖాయం… అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పత్రికా ముఖంగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. మరో రెండు మూడు వారాల్లో ఈ సినిమా వంద కోట్లు సాధిస్తే.. టాలీవుడ్లో వంద కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. సోమవారం హైదరాబాద్లో నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ ”మీ సినిమా వంద కోట్లు సాధిస్తుందా?? అని అందరూ అడుగుతున్నారు. ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మా రికార్డులు, వసూళ్లు దాచుకోవడం లేదు. ఏ ట్విట్టర్ ఎకౌంట్ చూసినా అంకెలు కనిపిస్తున్నాయి. ఇందులో దాపరికాలు లేవు..” అంటున్నారాయన. పవన్ ఈ సంచలనం సృష్టించే రోజు కోసం యావత్ తెలుగు చిత్రసీమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.