పారితోషికం విషయంలో మన కథానాయకుల మధ్య పోటీ మొదలైంది. అత్తారింటికి దారేది తరవాత పవన్ కల్యాణ్ రూ.25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఫిల్మ్నగర్ టాక్. పవన్ పాతిక అడిగితే కనీసం 20 అయినా ఇస్తారు కదా..? దక్షిణాదిన ఇది రికార్డే. అయితే ఆ రికార్డ్ బద్దలుకొట్టే సామర్థ్యం మహేష్ బాబుకి మాత్రమే ఉంది. ఇప్పటికే పారితోషికం విషయంలో తన రేంజు చూపించాడు మహేష్. 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ మహేష్కి భారీ పారితోషికాలు అందించి.. మూడు సినిమాల కోసం ఒప్పందాలు చేసుకొంది. తాజాగా యూటీవీ సంస్థ మహేష్ బాబుతో ఓ సినిమా చేయడం కూడా మహేష్ స్థాయిని పెంచే విషయమే. బాలీవుడ్లో యూటీవీ సంస్థకు ఎంతో క్రేజ్ ఉంది. కార్పొరేట్ శైలి నిర్మాణం.. పక్కా ప్లానింగ్ ని నిదర్శనం.. ఈ సంస్థ. తెలుగులో వీళ్లు తీస్తున్న మొదటి సినిమా ఇది. తొలి అడుగు ఓ సూపర్ స్టార్తో వేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. వారి దృష్టి మహేష్బాబు పై పడింది. ఈసినిమాకోసం యూటీవీ సంస్థ మహేష్కి భారీ మొత్తంలో పారితోషికం అందించారట. అంతేకాదు.. లాభాల్లో వాటా ఇస్తామని చెప్పారట. ఆ లెక్కన అన్నీ కలుపుకొంటే మహేష్ పారితోషికం దాదాపు రూ.25 కోట్లు దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఫిల్మ్నగర్ టాక్.