మంచు ఫ్యామిలీ అంతా కలసికట్టుగా నటిస్తున్న చిత్రం ’పాండవులు పాండవులు తుమ్మెద’. రవీనాటాండన్, హన్సిక, ప్రణీత కథానాయికలు. శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 11న గుంటూరులో విడుదల చేయబోతున్నారు. ముందు విశాఖపట్నంలో ఆడియోని రిలీజ్ చేద్దామనుకొన్నారు. కానీ చివరి నిమిషాల్లో వేదిక గుంటూరుకి మార్చారు. ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు. సినిమాని ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. మహాభారత కథను ఆధునీకరించి.. సినిమాగా తీస్తున్నారని టాక్. బృహన్నలగా మంచు మనోజ్ కనిపించనున్నాడు. ఆయన ఈ సినిమాలో చీర కట్టి సందడి చేశాడట.